కృష్ణవంశీ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత !


ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు కృష్ణవంశీ. ఆయన తీసిన సినిమాలు ట్రెండ్ సెట్ చేశాయి. సింధూరం, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ.. దేనికవే ప్రత్యేకం. వంశీకి ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. ఎన్ని ప్లాపులిచ్చిన ఆయన సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసే జనాలు ఉన్నారు. ‘నక్షత్రం’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొన్న కృష్ణ వంశీ ‘రుద్రాక్ష’ అనే సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇదే సినిమాకు మరో విశేషం ఏమిటంటే ? బడా నిర్మాత బండ్ల గణేష్ నిర్మాతగా మారబోతున్నాడు.

గతంలో వీరి కలయికలో ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా వచ్చింది. ‘రుద్రాక్ష’ లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది.
టాప్ హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారు. హీరోయిన్ ఓకే అయిన వెంటనే సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. రుద్రాక్ష కథని నిర్మాత దిల్ రాజు కూడా విన్నారు. చాలా బాగుందని కితాబిచ్చినట్టు తెలుస్తోంది. రుద్రాక్షతో మునుపతి కృష్ణవంశీ కనిపిస్తారేమో చూడాలి. అదే జరిగితే.. రుద్రాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే.