సునీల్ హీరోగా.. కెఎ పాల్ బయోపిక్ !?

టాలీవుడ్ లో కొత్త జోనర్ రాబోతుంది. పొలిటికల్ ఎంటర్ టైనర్ తెరకెక్కనుంది. అవునూ.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ బయోపిక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కెఎ చేసిన హడావుడి అంతా.. ఇంతా కాదు. హీటెక్కిన రాజకీయాలని తన మాటలు, చేష్టాలతో చల్లబరిచారు. కామెడీ చేశారు. దాన్ని ప్రజలు, పొలిటికల్ లీడర్స్ కూడా ఎంజాయ్ చేశారు. మీడియా కూడా పాల్’కు ప్రాధాన్యతనిచ్చింది. పాపం.. ఎన్నికల తర్వాత పాల్ ని మీడియా కూడా వదిలేసింది. సినిమా వాళ్లు మాత్రం పాల్ ని వదలడం లేదు. ఆయన జీవితకథని సినిమాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

కొత్త దర్శకుడు ఒకరు కెఎ పాల్ కథని రెడీ చేస్తున్నాడట. పాల్ పాత్రలో సునీల్ ని అనుకొంటున్నాడట. సునీల్ కూడా పాల్ గా మారేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఒక్కటే సమస్య.. తన బయోపిక్ తీసేందుకు కె ఎ పాల్ ఒప్పుకోవాలి. ఆయనలోని కామెడీ యాంగిల్ మాత్రమే కాకుండా.. సేవా, పట్టుదల, క్రమశిక్షణ, లక్ష్యాలని చూపిస్తామంటే పాల్ కూడా ఒప్పేసుకొంటాడు. అదే జరిగితే.. కె ఎ పాల్ జీవిత చరిత్ర అందిరికీ తెలిసిపోనుంది. అది కామెడీగా ఉంటుందా ? ఎమోషనల్ గా ఉంటుందా ?? అన్నది మాత్రం తెరపై చూడాలి.