హీరో రాజశేఖర్’కు తీవ్ర అస్వస్థత


సీనియర్ హీరో రాజశేఖర్ తీవ్ర అస్వస్థతకి గురైనట్లు సమాచారమ్. ఆయన ఒకట్రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. కోలుకొని బుధవారం కల్కీ ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొంటారని అందరు భావించారు. కానీ, రాజశేఖర్ ఇంకా కోలుకోలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో నేటి కల్కీ ప్రీ-రిలీజ్ వేడుకని క్యాన్సిల్ చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారమ్.

కల్కీ చిత్రానికి ‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అదా శర్మ కథానాయిక. గరుడవేగ తర్వాత రాజశేఖర్ నటించిన ‘కల్కీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే కల్కీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ శుక్రవారమే (జూన్ 28) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ ఒత్తిడిలోని రాజశేఖర్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.