స్వీటీ నిరాశే మిగిల్చింది.. !

స్వీటీ అనుష్కని తెరపై మరోసారి చూసుకోవాలని ఆమె అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత స్వీటీ చేస్తోన్న చిత్రం “భాగమతి”. అశోక్ దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆకట్టుకొంది. సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని చిత్రబృందం చెప్పడంతో.. స్వీటీ అభిమానులు ఆనందపడ్డారు. అయితే, ఇప్పుడు ‘భాగమతి’ డిసెంబర్’లో రావడం లేదని తేలిపోయింది.

డిసెంబర్ 22న అఖిల్ ‘హలో’ చెప్పబోతున్నాడు. దీంతో.. ‘భాగమతి’ని వచ్చే యేడాది ఫిబ్రవరికి మార్చినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్రబృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వాస్తవానికి ‘భాగమతి’ సంక్రాంతి సీజన్ లో రావడం కరెక్ట్ టైం. అయితే, సంక్రాంతి రేసులో పవన్ కళ్యాన్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. దీంతో భాగమతిని ఫిబ్రవరికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది.

బాహుబలి తర్వాత స్వీటీ మరింత సన్నబడిందన్న వార్తలు రావడం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని స్వీటీ పెళ్లాడబోతుంది. వచ్చే యేడాదియే వీరి వివాహం వార్తల నేపథ్యంలో ప్రభాస్, అనుష్క అభిమానులు ‘భాగమతి’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.