గేల్ రిటైర్మెంట్‌.. అదే చివరి మ్యాచ్ !


వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ఇప్పటికే రిటైర్మెంట్ పై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ అనంతరం ఆటకు గుడ్ బై చెబుతానని తెలిపారు. ఇప్పుడీ విషయంలో గేల్ మనసు మార్చుకొన్నాడు. స్వదేశంలో ఆగస్టు-సెప్టెంబరులో భారత దేశంతో జరిగే వన్డే, టెస్ట్ సిరీస్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు.

గురువారం మాంచెస్టర్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఉన్న నేపథ్యంలో గేల్ మీడియాతో మాట్లాడారు. ‘ఇది ఇప్పటికీ ముగిసినట్లు కాదు. ఇంకా కొన్ని మ్యాచ్‌లు ఆడతాను. మరో సిరీస్‌ కూడా ఆడొచ్చు. ప్రపంచకప్‌ తరవాత భారత్‌తో టెస్టు, వన్డే మ్యాచ్‌లు ఆడతాను. టీ20లు ఆడే ఉద్దేశం లేదు. ఇదే ప్రపంచ కప్‌ తరవాత నా ప్రణాళిక’ అని గేల్ మీడియాకు వెల్లడించాడు.