దారుణం : గోడ కూలి 17 మంది మృతి


మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. పుణెలోని కుంద్వాలో ఈ తెల్లవారుజామున భారీ వర్షం ధాటికి గోడ కూలి కాంప్లెక్స్‌ పక్కనే వలస కూలీలు నివసిస్తున్న రేకులషెడ్లపై పడింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

శిథిలాల కింద కార్లు, ఆటోలు చిక్కుకున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రొక్లెయిన్‌ సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. గత రెండు రోజులుగా మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.