కొత్త జెర్సీలో టీమిండియా


టీమిండియా జెర్సీలు మారాయి. ఇందులో ముదురు నీలం రంగుతో పాటు నారింజ రంగు కూడా జోడించారు. కొత్తగా ఆ జెర్సీలను ధరిస్తూ కోహ్లీసేన తాజాగా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆదివారం ఇంగ్లాండ్‌ X భారత్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీసేన కొత్త జెర్సీలను ధరించనుంది.

ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లాండ్ రెండు జట్లూ నీలిరంగు జెర్సీలను ధరిస్తూ ఆడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ రెండు జట్లు తలపడే మ్యాచ్‌లో టీమిండియా జెర్సీలు మారాయి. కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జెర్సీ కొత్త ఉత్సాహంతో ఆదివారం మ్యాచ్ లో ఇంగ్లాండ్ ని మట్టికరిపిస్తారేమో చూడాలి.