‘నినువీడని నీడనునేనే’ ట్రైలర్ టాక్


టాలీవుడ్ తీరు మారుతోంది. విభిన్నమైన సినిమాలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా యువ దర్శకులు, హీరోలు ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో సందీప్ కిషన్ హారర్ థ్రిల్లర్‌ ని ఎంచుకొన్నారు. ‘నినువీడని నీడనునేనే’ సినిమా చేస్తున్నారు. అనన్య కథానాయిక. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామక్రిష్ణ ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్‌, వి స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ‘400 సంవత్సరాల పూర్వం గ్రీసు పక్కన ఓ గ్రామంలో ఓ చిన్నపల్లవాడికి అద్దంలో ఓ పెద్దాయన రూపం కనిపించింది. ఆ ఊరివాళ్లు భయంతో ఆ చిన్నపిల్లాడిని చంపేశారు. చంపిన విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తున్నాం’ చర్చ ఫాదర్ చెప్పడం ట్రైలర్ లో చూడొచ్చు. సరిగ్గా ఈ లైన్ కు తగ్గట్టుగా సందీప్ కిషన్ అందంలో చూసినప్పుడు వెన్నెల కిషోర్ కనిపించడం ఆకట్టుకొంది. మొత్తంగా.. భయపెట్టే ఎలిమెంట్స్ తో పాటు.. కథపై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ ని కట్ చేశారు. జులై 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.