వావ్.. టీమిండియాకు పాక్ సపోర్ట్ !


‘మన మధ్య ఎన్నైనా విబేధాలు ఉండొచ్చు. కానీ, పక్కోడితో కొట్లాట అంటే.. మా పూర్తి మద్దతు మీకే’ అంటున్నారు పాకిస్థాన్ అభిమానులు. ఆదివారం భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ అభిమానులు టీమిండియాకు సపోర్టుగా నిలవడం విశేషం. ఈ మద్దతులోనూ వారి స్వార్థం కూడా ఉంది. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కనుక ఓడివుంటే.. పాక్ ఈజీగా సెమీస్ చేరేదే.

దృరదృష్ట్యవశాత్తు అది జరగలేదు. భారత్ ను 31పరుగులతో తేడాతో ఓడించింది ఆదిత్య ఇంగ్లాండ్. దీంతో పాక్ సెమీస్ చేరే అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. జులై 5న బంగ్లాదేశ్‌తో జరగబోయే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో పాక్ తప్పక గెలవాల్సిందే. దీంతో ఒపాటు.. కివీస్‌ చేతిలో ఇంగ్లాండ్‌ ఓడితేనే పాక్‌ జట్టుకు కలిసివస్తుంది. సెమీస్ కు చేరుతుంది. లేదంటే సర్ఫరాజ్‌ జట్టు తిరుగుముఖం పట్టాల్సిందే. ఏదేమైనా.. ఆదివారం పాక్ అభిమానులు టీమిండియాను సపోర్ట్ చేయడం ఆకట్టుకొంది.