సంక్రాంతి పుంజు బరిలోకి దిగింది

సంక్రాంతి పుంజు అనిపించుకొన్నాడు శర్వానంద్. గతంలో రెండుసార్లు శర్వానంద్ సంక్రాంతికి పెద్ద సినిమాల నడుమ వచ్చి హిట్ లు కొట్టాడు. అది కూడా మాములు హిట్స్ కావు. బ్లాక్ బస్టర్ హిట్స్. ఆయన మరోసారి సంక్రాంతి బరిలోకి దిగనున్నాడు. 2020 సంక్రాంతికి ఖర్చీప్ వేసేశాడు. శర్వానంద్-14రీల్స్ కాంబినేషన్ లో ‘శ్రీకారం’ రాబోతుంది. ఆదివారం ప్రారంభం అయింది. అప్పుడే సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించేశారు. శర్వా రాకతో వచ్చే యేడాది సంక్రాంతి పోరు మరింత రసవత్తంగా మారనుంది.

ఇప్పటికే బన్నీ, మహేష్ బాబు, రజనీ, బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి వున్నాయి. మరి వీటి మధ్యలో శర్వానంద్ సినిమా కూడా వచ్చేసింది. పోటీలో స్టార్స్ ఉన్న శర్వా సినిమాపై ఎఫెక్ట్ పడదు. ఆ విషయం గతంలో రుజువైంది. శ్రీకారం కథ కూడా మహర్షి సినిమా మాదిరిగా పొలాలు, పచ్చదనం, పల్లెటూర్ల చుట్టూ తిరుగుతుందని, కొత్త మార్పుకు, కొత్త ప్రగతికి శ్రీకారం చుట్టడం అనే మెసేజ్ వుంటుందని తెలుస్తోంది. అందుకే శర్వా సంక్రాంతికి ఫిక్సయ్యాడట. శర్వాతో స్టార్ హీరోలు జర జాగ్రత్తగా ఉంటే మంచిదేమో. లేదంటే పండగపూట వారి సినిమాల కలెక్షన్స్ ని శర్వా గండికొట్టడం ఖాయం.