టీమిండియాకు మరో గాయం


టీమిండియాకు మరో గాయమైంది. ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌ ప్రపంచకప్ నుంచి తప్పుకొన్నాడు. అతడి స్థానంలో కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ ని ఎంపిక చేశారు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. ప్రాక్టీస్‌ సెషన్‌లో జస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌ చేస్తుండగా విజయ్‌శంకర్‌ కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఓపెనర్ శిఖర్ ధావన్ రూపంలో టీమిండియాకు తొలి గాయమైంది. గాయంతో ధావన్ ప్రపంచకప్ కు దూరమయ్యాడు. ఇప్పుడు విజయ్ శంకర్ కూడా ధావన్ దారిలోనే వెళ్లాల్సి వచ్చింది.

ఇక, బర్మింగ్‌హామ్‌ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 31 పరగుల తేడాతో ఓటమిపాలైంది. తదుపరి మ్యాచ్‌ మంగళవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే కోహ్లీ సేన సెమీస్ బెర్త్ ఖాయమైనట్టే. లేదంటే ఆఖరి లీగ్ మ్యాచ్ శ్రీలంక తో తప్పక గెలిచి తీరాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది.