టీడీపీలోకి మాజీసీఎం సోద‌రుడు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు టీడీపీలోకి చేరిపోవ‌డం లాంఛ‌నంగా మారింది. గ‌త కొంత కాలంగా కిర‌ణ్ కుమార్ రెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు న‌ల్లారి కిషోర్ కుమార్ కూడా టీడీపీలో చేర‌తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.తెలంగాణ ఏర్పాటు త‌రువాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న కిర‌ణ్ కుమార్ రెడ్డి మాత్రం పార్టీలో చేర‌డంపై ఎలాంటి స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌లేదు. కానీ ఆయ‌న సోద‌రుడు మాత్రం చాలా కాలంగా టీడీపీ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతూనే ఉన్నారు.కానీ అధికార పార్టీ నుంచి ఎటువంటి స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో కొన్నాళ్లు మిన్న‌కుండిపోయారు.

తాజాగా ఆయ‌న చేరిక అంశం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఈ విష‌యంపై సీఎం చంద్ర‌బాబుతో స‌మావేశ‌మ‌య్యారు. రెండుగంట‌ల పాటు కిషోర్ కుమార్ కు , సీఎం చంద్ర‌బాబుకు మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. ఇదే నెల‌లో 23న లేదా 25న టీడీపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ త‌రువాత ఎన్నిక‌ల నాటికి మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా పార్టీలో చేర‌వ‌చ్చ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. చూడాలి మ‌రి రాబోయే రోజుల్లో ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు ఏవిధంగా మార‌తాయో.