తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న సమంత


హీరోయిన్ సమంత ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ఆమెతో పాటు ద‌ర్శకురాలు నందినీరెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఎదుటకు వచ్చిన సమంతను చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. ఫోటోలు, సెల్ఫీలు తీసుకొనేందుకు ఎగబడ్డారు.

నందినీరెడ్డి ద‌ర్శక‌త్వంలో సమంత న‌టించిన ‘ఓ బేబి’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నందినిరెడ్డి, సమంత శ్రీవారి దర్శణానికి వచ్చారు. మజిలీ తర్వాత సమంత నటించిన చిత్రం ఓ బేబీ. ఓ వృద్ధురాలికి మళ్లీ యవ్వన వయసు వస్తే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. సమంత వృద్ధురాలయ్యాక ప్రముఖ నటి లక్ష్మి పాత్రలో కనిపిస్తారు. వినోదాత్మకంగా ఎమోషనల్ గా ఓ బేబీ ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.