ప్రివ్యూ : బుర్రకథ


ఒక వ్యక్తికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుంది? అదే పాయింట్ తో తెరకెక్కిన చిత్రం ‘బుర్ర కథ’. ప్రముఖ రచయిత డైమండ్ రత్నం దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

ప్రివ్యూ :

* ‘ఒక వ్యక్తికి రెండు మెదళ్లు’ ఊహకు తెర రూపమే ‘బుర్ర కథ’.

* నిజంగానే ఇలాంటి వాళ్లు ప్రపంచలో 16మంది ఉండేవారట

* రచయితగా డైమండ్ రత్నం నిరూపించుకొన్నాడు. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధిస్తాడేమో చూడాలి

* అభి ఒకలా రామ్‌ ఒకలా ఉంటారు. కానీ ఇద్దరూ ఒక్కటే. అదే ఈ కథలో గమ్మత్తు

* ఆది సాయికుమార్ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఐతే, ఈ మధ్య హిట్స్ లేవు

* బుర్రకథతో తిరిగి హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు

* స్క్రీన్‌ ప్లే ప్రధానమైన కథ ఇది.

* విశ్రాంతి, పతాక సన్నివేశాల్లో వచ్చే మలుపులు అదిరిపోయేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.