గుడ్ న్యూస్ : ఇకపై బ్యాంకు పరీక్షలన్నీ తెలుగులోనే

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు ఎంతో కాలంగా కోరుతున్న డిమాండ్‌ ఇన్నాళ్లకి నెరవేరింది. ఇకపై బ్యాంకు పరీక్షల్ని తెలుగులోనే రాసుకోవచ్చు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(ఆర్‌ఆర్‌బీ)కు సంబంధించి స్కేల్‌-1 అధికారులు, కార్యాలయ సహాయకుల పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు చేపట్టే పరీక్షలను ఇకపై ఆంగ్లం, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్ లో వెల్లడించారు.

ఇప్పటివరకు ఈ పరీక్షల్ని కేవలం ఆంగ్లం, హిందీల్లో మాత్రమే నిర్వహిస్తుండడంతో స్థానిక భాషల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు నష్టపోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇకపై.. తెలుగు, అస్సామీ, బంగ్లా, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూల్లో కూడా నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-8(2019) మెయిన్స్‌ పరీక్ష నుంచి అమలవ్వనుంది.