పాక్ సెమీస్ ఆశలు గల్లంతు

ప్రపంచకప్ లో పాకిస్థాన్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా (14 పాయింట్లు), భారత్ (13), ఇంగ్లాండ్ (12) జట్లు
సెమీస్ బెర్తుని ఖరారు చేసుకొన్నాయి. మిగిలిన ఒక బెర్తు కోసం న్యూజిలాండ్ (11), పాకిస్థాన్ (9) పోటీపడుతున్నాయి.

పాక్ సెమీస్ చేరాలంటే బంగ్లాదేష్ ని భారీ తేడాతో ఓడించాలి. ప్రస్తుతం పాక్-బంగ్లా మ్యాచ్ కొనసాగుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో పాక్ సెమీస్ చేరాలంటే 308 పరుగుల తేడాతో బంగ్గాని ఓడించాలి. అంటే.. 7పరుగులకే బంగ్లాని ఆలౌట్ చేయాలి. కానీ, అది అసాధ్యం.

ప్రస్తుతం బంగ్లా 48/2 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ సెమీస్ ఆశలు గత్తంతయ్యాయి. న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ని ఖరారు చేసుకొంది. ముందు నుంచి ఊహించినట్టుగానే.. ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కి చేరాయి. ఇకపై బలమైన జట్ల మధ్య పోరు రసవత్తరంగా జరగనుంది.