బోనమెత్తిన హీరోయిన్.. !


హాట్ హీరోయిన్ బోనమెత్తింది. పోరాటాల ఖిల్లా వరంగల్ లో బోనమెత్తి ప్రేక్షకులని ఫిదా చేసింది. పూరి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరోగా నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. నిధి అగర్వాల్, నభా నటాషా హీరోయిన్లు. ఆదివారం వరంగల్ లో జరిగిన ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్లు ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

నిధి అగర్వాల్ ఏకంగా బోనమెత్తింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో హీరోయిన్ నభా నటాషా కూడా ఇస్మార్ట్ శంకర్ భోనాల పండగలో పాల్గొని సందడి చేసింది. ఐతే, సినిమాలో నటాషా తెలంగాణ పోరగాళ్ల మీద సైటర్ కూడా వేసిందట. అదేంటీ ? అనేది సినిమాలో చూడాలన్నారు హీరో రామ్.

ఈ నెల 18న ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.