‘దొరసాని’ సెన్సార్ రిపోర్ట్


ఆనంద్ దేవరకొండ-శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘దొరసాని’. వీరిద్దరికి ఇదే తొలి చిత్రం. కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. ఈ నెల 12న దొరసాని ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ ని పొంది. టీజర్, ట్రైలర్, పాటలు చూస్తే.. ‘దొరసాని’కి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ రావడం గ్యారెంటీ అనిపించింది. ఐతే, అందుకు భిన్నంగా సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ ఇచ్చింది.

అందుకు కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. బహుశా.. స్టోరీ టెల్లింగ్ కథలో యాక్షన్ మోతదు ఎక్కువై ఉండొచ్చు. తెలంగాణ యాస, బాష, సంస్కృతి, 1980కాలం నాటి పరిస్థితులని వాస్తవంగా చూపించడంలో యు/ఎ సర్టిఫికె దక్కివుండవచ్చు. విడుదలకి ముందే దొరసాని పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంది. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.