‘మిషన్‌ మంగళ్‌’ టీజర్ టాక్


బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. జగన్‌ శక్తి దర్శకుడు. తాప్సీ, విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్‌, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగ‌స్ట్ 15న ‘మిషన్‌ మంగళ్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఉత్కంఠని కలిగించే సన్నివేశాలతో ‘మిషన్‌ మంగళ్‌’ టీజర్ ని కట్ చేశారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, నిత్యామీనన్, తాప్సీ.. శాటిలైట్ ప్రయోగంలో, వ్యక్తిగత జీవితంపై కట్ చేసిన సన్నివేశాలతో టీజర్ ని కట్ చేశారు. ఆగస్టు 15 రాబోతున్న మిషన్ మంగళ్ ప్రభాస్ సాహో సినిమాతో పోటీ పడనుంది.