బీజేపీలోకి టీఆర్ఎస్ కీలక నేత !


తెరాసకి బిగ్ షాక్. ఇన్నాళ్లు ఇతర పార్టీల నుంచి తెరాసలోకి నేతలు క్యూ కట్టారు. అలా వచ్చినవారితో కారు నిండిపోయింది. తెదేపా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. తాజాగా సీన్ రివర్స్ అయింది. తెరాస నుంచి వలసలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సోమారపు గోదావరిఖని నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై స్వతంత్ర అభ్యర్థి చందర్ గెలుపొందారు. ఆ తర్వాత చందర్ కారెక్కారు. అప్పటి నుంచి సోమారపు సలైంట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఆశలు చిగురిస్తున్న వేళ.. ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే టీఆర్ ఎస్ కు రాజీనామా చేశారు. రాబోయే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మారుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ మార్పుకి మొదలు సోమారపు రాజీనామా అవుతుందేమో చూడాలి.