సమంత-నందినిరెడ్డి వన్స్ మోర్.. ఈ సారి థ్రిల్లర్ !

‘ఓ బేబీ’ కాంబోలో మరో సినిమా రాబోతుందా ? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొంది. కేవలం నాలుగు రోజుల్లో రూ. 17కోట్లు కలెక్ట్ చేసింది. పోటీలో మరో పెద్ద సినిమా లేకపోవడంతో.. బేబీ కలెక్షన్స్ దగ్గర దగ్గర రూ. 100కోట్లకి చేరువగా వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయ్.

ఈ ఆనందంలో సినిమా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకొంటోంది చిత్రబృందం. ఇటీవల జరిగిన ఓ బేబీ సక్సెస్ మీట్ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి సామ్ ని సప్రైజ్ చేసిందట. తన తదుపరి సినిమాకు సంబంధించి సామ్ కు లైన్ చెప్పిందట. అదికూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాయే. ఎవరితో ప్లాన్ చేస్తున్నారని అడిగితే.. నిన్నే దృష్టిలో పెట్టుకొని రాశానందట. దీంతో సామ్ వెంటనే మనం మరో హిట్ కొట్టబోతున్నాం. స్క్రిప్ట్ పూర్తి చేయు. సినిమా చేద్దాం అందట. ఐతే, ఈసారి థ్రిల్లింగ్ కథాంశంతో నందినిరెడ్డి కథని రాసుకొంది. సామ్ తో కలిసి ప్రేక్షకులని థ్రిల్ చేయబోతుందని చెప్పుకొంటున్నారు.