సందీప్ వంగా కోసం సల్మాన్, షారుఖ్.. !


బాలీవుడ్ లోనూ సందీప్ వంగా బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. టాలీవుడ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘అర్జున్ రెడ్డి’ని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’గా తీసుకొచ్చారు. ఇందులో షాహిద్ కపూర్-కైరా అద్వానీ జంటగా నటించారు. టాలీవుడ్ ని మించి బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి కథ కబీర్ సింగ్ హిట్టయింది. అదే సమయంలో వివాదాలు తలెత్తాయ్. కబీర్ సింగ్ సినిమా ప్రమోషన్స్ లో సందీప్ చేసిన కామెంట్ పై తీవ్ర దుమారం రేగింది.

‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు. సందీప్ వ్యాఖ్యలని చాలా మంది తప్పుబట్టారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు సందీప్ వ్యాఖ్యలని తప్పుబట్టింది. ఇక, ఈ కామెంట్స్ తో బాలీవుడ్ మీడియాలో సందీప్ పేరు మారుమ్రోగిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలనే ఆలోచనలో సందీప్ వంగా ఉన్నారు. ఇందుకోసం తన తదుపరి సినిమా ప్రకటించి ప్రేక్షకులని షాక్ ఇవ్వబోతున్నాడట.

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ లేదంటే షారుఖ్ ఖాన్ తో తన తదుపరి సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సందీప్ తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండాలి. ఇప్పటికే మహేశ్ కి ఓ లైన్ వినిపించాడు. అది మహేష్ కి నచ్చింది. పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేయమని చెప్పాడు. ఐతే, ప్రస్తుతం మహెష్ బిజీ. ఈ నేపథ్యంలో సందీప్ వంగా బాలీవుడ్ లో మరో సినిమా చేసి వద్దామనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.