‘దొరసాని’ డైరెక్టర్స్ రివ్యూ

ఆనంద్ దేవరకొండ-శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘దొరసాని’. వీరిద్దరికి ఇదే తొలి చిత్రం. కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలని పెంచేసిన ‘దొరసాని’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఐతే, గురువారం రాత్రి ‘దొరసాని’ స్పెషల్ షోని టాలీవుడ్ సంచలన దర్శకులు సందీప్ వంగా, ప్రశాంత్ వర్మ, వేణు ఉడుగుల, గౌతమ్ తిన్నమూరి, అజయ్ భూపతి వీక్షించారు. సినిమాపై అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపీంచారు. ఇంతకీ సంచలన దర్శకులు ఏమన్నారంటే.. ?

సందీప్ వంగా : సినిమా చూస్తున్న సేపు స్టోరీలోనే ఉన్నా. నేను ఎంజాయ్ చేశాను

ప్రశాంత్ వర్మ : స్వచ్ఛత, నిజాయితీ కూడిన ప్రేమకథ

వేణు ఉడుగుల : ప్రతి క్రాప్ట్ కూడా అద్భుతంగా పనిచేసింది. 2019కి బెస్ట్ లవ్ స్టోరీ

గౌతమ్ తిన్నమూరి : మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ఎంజాయ్ చేశాను. ఈ అనుభవం నాతో చాలా కాలం ఉంటుంది

అజయ్ భూపతి : మైండ్ బ్లోయింగ్ మూవీ