కోల్’కతా టెస్ట్ : టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ 172 ఆలౌట్

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 172 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు శ్రీలంక బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది కొనసాగింది. పుజారా 52 పరుగుతులు ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. సాహా (29), జడేజా (22) జట్టుకొనే ఆదుకొనే ప్రయత్నం చేశారు. చివర్లో మహ్మద్ షమి (24) దూకుడు చూపించాడు. లంక బౌలర్లలో రంగ లక్మల్‌ (4/26), లాహిరు గమగె, దసున్‌ శనక, దిల్రువాన్‌ పెరీరా తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక దూకుడుగా ఆడుతోంది. ప్రస్తుతం 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆ రెండు వికెట్లని భునేశ్వర్ కుమార్ పడగొట్టాడు. ప్రస్తుతం మాథ్యూస్ 6 పరుగులు, తిరిమనె 27 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.