ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా.. !

భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేష్‌, రాజేంద్ర ప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి – ది క్రికెటర్‌’. ఈ సినిమా టీజర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైంది. మంచి స్పందన సొంతం చేసుకొంది. తాజాగా ఈ సిమిమా నుంచి ‘ముద్దబంతి పువ్వు.. ‘ లిరికల్ సాంగ్ విడుదలైంది.

ఈ పాటని యాజిన్ నాజిర్ పాడారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. థామస్ సంగీతం అందించారు. పాట వినడానికి ఆహ్లాదకరంగా ఉంది.

ఎప్పుడు నిలిచే భుజమవుతా…
కలలు కంటే నిజమవుతా..
కష్టం వస్తే కలబడతా..
కడదాకానే నిలబడతా…!! లైన్స్ అద్భుతంగా కుదిరాయి

ఈ చిత్రానికి కె.ఏ.వల్లభ నిర్మాత. కె.ఎస్‌.రామారావు సమర్పకుడు. త్వరలోనే ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.