మహేష్ సినిమా నుంచి జగపతి అవుట్.. ఎందుకంటే ?

సూపర్ మహేష్ బాబు 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కశ్మీర్ లో తొలి షెడ్యూల్ జరుపుకుంటోంది. అక్కడ మహేష్ జవాన్ గా కనిపించే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దానికి సంబంధించిన ఒకట్రెండు ఫోటోలు లీకయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పుడీ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఈ సినిమాలో విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్
కీలక పాత్రలో నటిస్తున్నారు. ఐతే, సడెన్ గా ఈ సినిమా నుంచి జగపతి బాబు తప్పుకొన్నట్టు తెలిసింది. ఆయన స్థానంలో ప్రకాష్ రాజ్ ని తీసుకొన్నారు. ఇంతకీ జగపతి బాబు ఎందుకు తప్పుకొన్నట్టు ? అన్నది మాత్రం తెలియరాలేదు.

ఇక, ‘ఆగడు’ వివాదం తర్వాత ప్రకాష్ రాజ్ మహేష్ సినిమాల్లో కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లు ఆయనకి మహేష్ తో కలిసి తెరను పంచుకోనున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తోంది. దిల్ రాజు-అనిల్ సుంకర్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.