రాజమౌళి రూ.50లక్షల లంచం అడిగారట.. !


దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’లో ఆఫర్ ఇస్తానని రూ.50లక్షల లంచం అడిగారట. అది నిజమేనని నమ్మింది ఓ మహిళా. రూ. 50లక్షలని పోగోట్టుకొంది. ఆర్.ఆర్.ఆర్ లో ఆఫర్ ఇప్పిస్తానని నమ్మబలికిన వ్యక్తులని నమ్మి ఘోరంగా మోసపోయింది. సదరు మహిళా న్యాయవాది కావడం గమనార్హం.

సినీ నిర్మాత ఆదిత్యను మాట్లాడుతున్నానని, చాలా సిన్మాలు తీశానని, నాకు డైరెక్టర్ రాజమౌళి తెలుసని సినిమాల్లో నటించేందుకు ఆసక్తి ఉందా అన్ని అడిగారట. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో తల్లి పాత్రకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి.. ఫిల్మ్ ఛాంబర్ ఐడి కార్డు, మా ఐడి కార్డు, టివి సీరియల్ కార్డు తదితర వాటిని తీసుకోవాలని చెప్పడంతో దశల వారీగా రూ.50లక్షలు గుంజారట. ఓ కట్టుకథ చెప్పి మహిళా నుంచి షిఫ్ట్ కారు కూడా కొట్టేశారట.చివరికి తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళా న్యాయవాది బోయిన్ పెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులని అరెస్ట్ చేశారు. మరో 13 మంది పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.