క్లాస్+మాస్ కాంబో.. వర్కవుట్ అవుద్దా !


తొలి సినిమానే ప్రేక్షకులకి షాక్ ఇచ్చాడు దర్శకుడు అజయ్ భూపతి. ‘ఆర్ఎక్స్ 100’లాంటి బోల్డ్ సినిమాతో సంచలన విజయాన్ని సాధించాడు. తన రెండో సినిమా టైటిల్ ‘మహా సముద్రం’ అని ప్రకటించారు. ఈ కథ చాలామంది హీరోల దగ్గరకు వెళ్లింది. పైనల్ గా మాస్ మహారాజా రవితేజ ఫిక్సయ్యాడు. ఐతే, ఇప్పుడీ సినిమా గురించి ఇంట్రెస్టెంగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. ఈ సినిమా కోసం హీరో సిద్ధార్థ్ ని కూడా తీసుకొన్నారట.

టాలీవుడ్ లో సిద్ధార్థ్ కి క్లాస్ ఇమేజ్ ఉంది. ‘బొమ్మరిల్లు’లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఆకట్టుకొన్నారు. ఐతే, సిద్ధార్థ్ తెలుగు సినిమా చేయక చానాళ్లవుతుంది. తమిళ్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అలాంటి సిద్ధార్థ్ ని మహా సముద్రం కోసం తీసుకొని షాక్ ఇచ్చాడు అజయ్ భూపతి. క్లాస్+మాస్ హీరోలని భూపతి ఎలా డీల్ చేస్తాడన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. దానికి సినిమాతోనే సమాధానం చెబుతాడేమో చూడాలి.