సింధు బంగారం తెస్తుందా !

భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్‌ ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో 21-19, 21-10తో చైనా అమ్మాయి చెన్‌ యూఫీపై వరుస గేముల్లో ఘన విజయం సాధించింది. తొలిగేమ్‌లో తడబడ్డ సింధు రెండో గేమ్‌లో తన సహజ ఆటతీరును బయటకు తీసుకొచ్చింది. 10-10తో స్కోరు సమం చేసి వరుసగా 11 పాయింట్లు సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ప్రపంచ మూడో ర్యాంకు క్రీడాకారిణి చెన్‌యూఫీ ఈ ఏడాది ఆస్ట్రేలియా, స్విస్‌, ఆల్‌ఇంగ్లాండ్‌ కైవసం చేసుకొని జోరుమీదుంది. ఆమెపై సెమీస్ లో విజయంతో ఫైనల్లో సింధుకు ఆత్మవిశ్వాసం పెంచేదే. ఫైనల్లో జపాన్ కు చెందిన అకానె యమగూచితో సింధు తలపడనుంది. ఫైనల్ లో సింధు గెలిస్తే.. స్వర్ణం. ఓడితే.. రజతం ఖాయం. మొత్తానికి ఇండోనేషియా ఓపెన్‌ లో సింధూకి టైటిల్ పక్కా అయింది అన్నమాట.