జగన్ ప్రజలని మోసం చేస్తున్నారు !


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలని మోసం చేస్తున్నారని అన్నారు కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత దగ్గుబాటి పురందేశ్వరి. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం. హోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పినా ప్రజలను మోసం చేస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు.

గ్రామ సచివాలయ విధానంతో అనేక మందికి ఇబ్బందులు తలెత్తుతాయని పురందేశ్వరి అన్నారు. రేషన్‌ డీలర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరారు. ఇసుక, మట్టి విధానంలో ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. భాజపాలోకి పలువురు నేతలు రావడం సంతోషకరమని పురందేశ్వరి అన్నారు. మరీ.. పురందేశ్వరి కామెంట్స్ పై సీఎం జగన్, వైకాపా శ్రేణులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.