గీత దాటిన దర్శకుడు

దర్శకుడు పరశురామ్ గీత దాటాడు. ఆయన ‘గీత ఆర్ట్స్’ బ్యానర్ లో ఆస్థాన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్న సంగతి తెలిసిందే. ఆయన గీతలో వరుసగా శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం సినిమాలు చేశాడు. వీటిలో గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా రూ. 100కోట్లకిపైగా వసూళ్లు సాధించింది. పరశురామ్ తర్వాతి సినిమా కూడా గీతలో ఉండనుంది. మహేష్ బాబు హీరోగా గీత ఆర్ట్స్ ప్లాన్ చేసిన చిత్రానికి పరశురామ్ దర్శకుడుగా ఫిక్సయ్యాడు. ఐతే, ఇప్పుడీ సినిమా చేతులు మారినట్టు సమాచారమ్.

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సినిమా పక్కా. ఐతే, ఆ సినిమాని గీత ఆర్ట్స్ నిర్మించడం లేదట. మహేష్ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ నిర్మాతగా మారబోతున్నాడు. ఆయన స్నేహితుడితో కలిసి మహేష్ సినిమాని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమా తర్వాత మహర్షి దర్శకుడు వంశీపైడి పల్లి దర్శకత్వంలో మహేష్ మరో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత పరశురామ్ సినిమా ప్రారంభం కానుంది.