స్టార్ హీరో.. దారుణమైన పరిస్థితి !

విలక్షణ నటుడు విక్రమ్ సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూసేవారు. ఆయనకి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఐతే, ఇప్పుడు విక్రమ్ పూర్తిగా టాలీవుడ్ కి దూరమైనట్టు కనిపిస్తోంది. ఆయన తాజా చిత్రం ‘మిస్టర్ కేకే’. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. వీకెండ్ పూర్తయ్యేలోపే సినిమాని థియేటర్స్ లోంచి తీసేశారు.

హైదరాబాద్ తో పాటు ఆంధ్రలోని చాలా పట్టణాల్లో మిస్టర్ కెకె సినిమాను తొలిగించారు. ఆ స్థానంలో ఇస్మార్ట్ శంకర్, ఓ బేబీ సినిమాల్ని ఆడిస్తున్నారు. అలా శుక్రవారం రిలీజైన ఈ సినిమా చాలా సెంటర్లలో శనివారానికే దుకాణం సర్దేసింది. ఇది విక్రమ్ ఎదురైన పెద్ద అవమానంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. ? టాలీవుడ్ లో స్టార్స్ సినిమాలేవీ గతవారం విడుదల కాలేదు.

ఓ బేబీ హవా ఎప్పుడో తగ్గింది. ఇస్మార్ట్ శంకర్ ఒక్కటి క్రేజీ సినిమా. అందులోనూ పూరి, రామ్ ఫామ్ లో లేరు. అయినా పాజిటివ్ టాక్ తో ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. కేవలం 4రోజుల్లోనే రూ. 50కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కనీసం రామ్ సినిమాకి కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితికి విక్రమ్ పడిపోయాడని చెప్పవచ్చు. విక్రమ్ నటనకి వంకపెట్టలేం. కానీ, కథల విషయంలోనే శ్రద్ద వహిస్తే ఈ పరిస్థితి రాదేమో.. !