ఆగస్టు 12 నుంచి జియో గిగా ఫైబర్‌ సేవలు ?

టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో త్వరలోనే బ్రాండ్‌ సేవలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న జియో ఫైబర్‌ కనెక్షన్‌ తీసుకుంటే బ్రాడ్‌ బ్యాండ్‌తో పాటు, ల్యాండ్‌లైన్‌ సౌకర్యం కల్పిస్తోంది. 100 ఎంబీపీఎస్‌ వేగంతో 100 జీబీ వరకూ 90 రోజుల పాటు ఉచిత సేవలను పొందవచ్చు. నెలసరి కనీస ప్లాన్‌ రూ.600 ఉంటుందని అంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 12వ తేదీ నుంచి రిలయన్స్‌ జియో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే నెలలో జరగనున్న సాధారణ సర్వసభ్య సమావేశంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించే అవకాశం ఉందని ఆంగ్లమీడియా వర్గాలు పేర్కొన్నాయి.