‘మన్మథుడు 2’ ట్రైలర్ ముహూర్తం ఫిక్స్


రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో కింగ్‌ నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సమంత, కీర్తి సురేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ గురువారం (జులై25) ఉదయం 11:11నిమిషాలకి ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

నాగ్ బ్లాక్ బస్టర్ ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని భావిస్తున్నారు. ఈ కథ మన్మథుడుకి రివర్స్ లో ఉండనుందట. నాగ్, రకుల్ ల్లో రెండు షేడ్స్ ఉన్నట్టు టీజర్ లో చూపించారు. ముందు పద్దగా కనిపించిన వీరిద్దరు.. ఆ తర్వాత బోల్డ్ కనిపించారు. సినిమా వినోదాత్మకంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్ర డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ. 8కోట్లకి కొనుగోలు చేసింది. నాగార్జున చిత్రాల్లో డిజిటల్ హక్కుల ద్వారా అత్యధిక మొత్తాన్ని వసూలు చేసిన చిత్రం ఇదే కావడం విశేషం.