గురుకుల టీచ‌ర్ల ప‌రీక్ష ఫ‌లితాలు వ‌చ్చేశాయ్..

గురుకుట టీచ‌ర్ ప‌రీక్ష ఫ‌లితాల‌ను టీఎస్ పీఎస్సీ విడుద‌ల చేసింది. గురుకులాల‌లో ఖాళీగా ఉన్న ఇంగ్లీష్, ఉర్దూ పోస్టుల‌కు గ‌తంలో టీఎస్ పీఎస్సీ నోటిఫికేష‌ష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 986 పోస్టులకు సెప్టెంబర్3, 4, తేదీలలో పరీక్ష నిర్వహించారు.

విడుద‌లైన ఫ‌లితాల‌లో మొత్తం 1760మంది అభ్య‌ర్థులు ఎంపిక‌య్యారు. 1:2 ప్రకారం పోస్టుల‌కు ఎంపిక చేయ‌నున్నారు.
ఈ నెల నవెంబర్ 23, 24 తేదీలలో సాంకేతిక భవన్ మసబ్ ట్యాంక్ వ‌ద్ద స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ ఉంటుంద‌ని, మ‌రిన్ని వివ‌రాల కోసం టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ www.tspsc.gov.in ని సంప్రదించాల‌ని టీఎస్ పీఎస్సీ తెలిపింది.