ఇంద్రగంటికి పితృవియోగం


టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శ్రీకాంతశర్మ అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. శ్రీకాంతశర్మ.. గేయకవి, పండితుడు, రచయిత కూడా. గతంలో పత్రికాసంపాదకుడిగా పని చేశారు. ఈ సాయంత్రం అల్వాల్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రస్తుతం ఇంద్రగంటి ‘వి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సుధీర్ బాబు, నాని కథానాయకులుగా నటిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావు హైదరి కథానాయికలు. ఇందులో నాని నెగటివ్ టచ్ ఉన్నరోల్ లో కనిపిస్తారని సమాచారమ్. స్వఛ్ఛమైన వినోదం పండించడం ఇంద్రగంటి ప్రత్యేకత. ఆయన సినిమాలు ఆహ్లాదకరంగా ఉంటాయి.