జగన్ ఆశలపై కేంద్రం నీళ్లు


ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కేంద్రం నీళ్లు చల్లింది. ఎలాగైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలనే ఆశతో ఉన్నారు ఏపీ సీఎం. అదీ సాధ్యం కాకపోతే కనీసం పన్నురాయితీలు అయినా వస్తాయని ఆశపడ్డారు. కానీ, ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక పన్ను రాయితీలు ఏమీ లేవని మరోసారి స్పష్టం చేసింది.

గురువారం లోక్ సభలో ఏపీకి పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పింస్తుందా ? అని ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి నితిన్‌ గడ్కరీ సమాధానమిస్తూ.. ‘విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అంతేగానీ ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదు’ అన్నారు.