‘మన్మథుడు-2’ ఆ సినిమాకి రిమేక్ !


రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఈ సినిమా రిమేక్ అని, మన్మథుడు 2 సీక్వెల్ అనే ప్రచారం జరిగింది. గురువారం ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు నాగ్.

ఓ ఫ్రెంచ్ సినిమా రిమేక్ ఇది. ఏడాదిన్నర కిందట ఈ స్క్రిప్ట్ నాకు వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. అయితే కథ మీద చర్చలు అప్పుడే ప్రారంభించలేదు. 2 నెలలు సంప్రదించి రీమేక్ రైట్స్ తీసుకున్న తర్వాతే కథ మీద చర్చలు మొదలుపెట్టాం. చివరికి ఈ రీమేక్ ను హ్యాండిల్ చేసిన దర్శకుడు రాహుల్ కు కూడా రిమేక్ రైట్స్ పేపర్స్ చూపించిన తర్వాతే ప్రాజెక్టు స్టార్ట్ చేశామని నాగ్ తెలిపారు. మొత్తానికి మన్మథుడు 2 ఓ ఫ్రెంచ్ సినిమాకి రిమేక్ అని క్లారిటీ ఇచ్చారు. ఇక, ‘మన్మథుడు’తో పోలికపై స్పందించారు. ఈ రెండు సినిమాల్లో ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది. అదే కామేడీ జోనర్. మిగితా విషయాల్లో అసలు పోలికే ఉండవన్నారు.