సభ్యత్వ నమోదులో తెరాస రికార్డు


తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఐతే, ఈ నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని టీఆర్ఎస్ వర్మింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. శుక్రవారం కేటీఆర్ పార్టీ సభ్యత్వ నమోదుపై తెలంగాణ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా సభ్యత్వ తీరుపై బాధ్యులను అడిగి తెలుసుకున్నారు.

నెలలోనే 50 లక్షల సభ్యత్వ నమోదు కావడం దేశ రాజకీయాల్లో అరుదని కేటీఆర్‌ పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు చేసుకున్న వారందరికీ ఆగస్టు 1 నుంచి బీమా సౌకర్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. 70 వేలకుపైగా సభ్యత్వ నమోదుతో గజ్వేల్, పాలకుర్తి నియోజకవర్గాలు ముందున్నాయన్నారు. సభ్యత్వ నమోదు పూర్తయిన నియోజకవర్గాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇక ఇప్పటి వరకు సభ్యత్వ రుసుం కింద 15 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిసింది.