రామ్’కు రూ. 2కోట్ల బోనస్ !


పూరి దర్శకత్వంలో రామ్ నటించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ అయింది. కేవలం 12రోజుల్లోనే రూ. 35కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్ లో రూ. 40కోట్లని టచ్ చేయనుందని చెబుతున్నారు. రూ. 15కోట్లకి అమ్మిన ఇస్మార్ట్ శంకర్ భారీ లాభాలని తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు పూరి-ఛార్మిలకి భారీ లాభాలు దక్కాయి. ఇందులో నుంచి రూ. 2కోట్లు రామ్ కి అదనంగా ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి ఇస్మార్ట్ శంకర్ కోసం రామ్ చాలా తక్కువ రెమ్యూనరేషన్ కే అంగీకరించాడు. అసలు పూరి వైపు ఏ హీరో చూడన టైంలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రామ్ కి రూ. 2కోట్ల బోనస్ ఇచ్చేందుకు ఛార్మి-పూరి డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం రామ్ ఫారిన్ టూర్ లో ఉన్నారు. తిరిగొచ్చాక బోనస్ అందజేయనున్నారు. ఇది రామ్ బోనస్ గా స్వీకరిస్తారా ? లేదంటే డబుల్ ఇస్మార్ట్ శంకర్ కి అడ్వాన్స్ లా తీసుకొంటాడా ?? అన్నది చూడాలి.