పుల్వామాలో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి

జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ (ఐఇడి)తో ఆర్మీ వాహనంపై దాడి చేశారు. జిల్లాలోని జహీద్‌బాగ్‌ గ్రామంలో 55 రాష్ట్రీయ రైఫిల్స్‌ వాహనంపై ఉగ్రవాదులు ఐఇడితో దాడి చేశారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దాడిలో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా ? అనే విషయం ఇంకా బయటికిరాలేదు. గత యేడాది పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకొన్న సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించి ఉగ్రవాదులని మట్టిపెట్టారు.