దారుణం : యువతిపై 4గురు గ్యాంగ్ రేప్


ముంబయిలోని చెంబూరు ప్రాంతంలో దారుణం చోటు చేసుకొంది. 19 ఏళ్ల యువతిని నలుగురు ఆగంతకులు సామూహిక అత్యాచారం చేశారు. వారి రాక్షసత్వానికి ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. నాలుక, ఒక కాలు పక్షవాతానికి గురయ్యాయి. ప్రస్తుతం ఆమె ఔరంగాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. జులై 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తొలుత జరిగిన దారుణం గురించి ఆమె కుటుంబసభ్యులకు చెప్పలేదు. అత్యాచారం జరిగినప్పటి నుంచి తనలో తానే కుమిలిపోతూ, ఏడుస్తూ ఉండేది. ఇటీవల ఆరోగ్యం బాగా క్షీణించిపోవడంతో ఔరంగాబాద్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆమె కోమాలోకి వెళ్లిపోయేదని వైద్యులు చెప్పారు. చివరికి బాధితిరాలు నోరితెరచి నిజం చెప్పడంతో ఆమె తల్లిదండ్రులకి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ సామూహిక అత్యాచారానికి సంబంధించి నలుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.