‘రణరంగం’ ట్రైలర్ టాక్


సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటించిన చిత్రం ‘రణరంగం’. కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రణరంగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక కాకినాడలో జరిగింది. ఈ వేడుకకి మాటల మాంత్రికుడు శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ‘రణరంగం’ థియెట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు.

‘ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహాల్ కట్టాడంటే.. డబ్బులెక్కవై అనుకొన్నా. కొంతమంది కోసం కట్టొచ్చు. ఖర్చు పెట్టొచ్చు’ అంటూ శర్వా వాయిస్ ఓవర్ ట్రైలర్ మొదలైంది. మొదట్లో రొమాంటిక్ సీన్స్. ఆ తర్వాత కథని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో శర్వా గ్యాంగ్ స్టర్ కనిపించే సన్నివేశాలని చూపించారు. రెండు షెడ్స్ లో శర్వా నటన అద్భుతంగా ఉంది. ‘ఫిక్షన్ స్టోరీ. సమాజంలో జరిగిన నిజమైన ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా’అని ట్రైలర్ లో చూపించారు.