‘సాహో’ నుంచి కిక్కునిచ్చే వీడియో.. !


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకి కిక్కునిచ్చే వీడియోని షేర్ చేశారు. ఆయన తాజా చిత్రం ‘సాహో’. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. ఈ యాక్షన్ ఎంటర్ ఎంటర్ టైనర్ కి సుజీత్ దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 300కోట్లకుపైగా బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. ఇటీవలే విడుదల చేసిన సాహో టీజర్ కి మంచి స్పందన దక్కింది. తాజాగా ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. ఇందులో బాక్సింగ్‌ కిక్‌ బ్యాగ్‌ను ఎలా కొట్టాలో దర్శకుడు సుజీత్‌ సూచనలు ఇస్తుండగా, ప్రభాస్‌ శ్రద్ధగా వింటూ కనిపించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్న ‘సాహో’పై భారీ అంచనాల ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో సాహోపై భారీ అంచనాలున్నాయి.