యాషెస్‌ తొలి టెస్టులో ఆసీస్ ఘనవిజయం


వన్డే ప్రపంచ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు యాషెస్‌ తొలి టెస్టులో ఘోర పరాభవం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ ఏకంగా 251 పరుగుల తేడాతో ఇంగ్లిష్‌ జట్టును చిత్తు చేసింది. 398 పరుగుల భారీ ఛేదనలో నాథన్‌ లైయన్‌ (6/49) ధాటికి ఇంగ్లాండ్‌ కుదేలైపోయింది. కనీస పోరాటం కొరవడిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది.

398 పరుగుల భారీ లక్ష్యఛేదనలో.. లైయన్‌కు తోడు పేసర్‌ కమిన్స్‌ (4/32) విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 52.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (144, 142) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన స్టీవ్‌ స్మిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో టెస్టు ఈనెల 14న లార్డ్స్‌లో ప్రారంభమవుతుంది.