వాల్మీకి కోసం హాలీవుడ్ టెక్నిషియన్


ప్రముఖ హాలీవుడ్‌ ఛాయాగ్రాహకుడు, మూడుసార్లు ఆస్కార్‌ విజేత రాబర్ట్‌ రిచర్డ్‌సన్‌ హైదరాబాద్‌ సందర్శనకి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తెలుగు చిత్రాల షూటింగ్ తీరుని పరిశీలిస్తున్నారు. ఆదివారం రాబర్ట్‌ ‘సరిలేరు నీకెవ్వరూ’ సెట్‌ని సందర్శించారు. చిత్రబృందంతో కాసేపు ముచ్చటించారు. షూటింగ్ జరుగుతున్న తీరుని పరిశీలించారు.

ఇక, సోమవారం ‘వాల్మీకి’ సెట్‌లో రాబర్ట్‌ రిచర్డ్‌సన్‌ సందడి చేశారు. సినిమాలో కొన్ని సన్నివేశాల్ని ఆయన చిత్రీకరించడం విశేషం. ఆ విషయాన్ని చిత్ర దర్శకుడు హరీష్‌ శంకర్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.

‘‘మూడుసార్లు ఆస్కార్‌ విజేతగా నిలిచిన వ్యక్తి మన కోసం కెమెరా బాధ్యతల్ని నిర్వహిస్తే ఎలా ఉంటుంది? ఛాయాగ్రాహణంలో దేవుడులాంటి వ్యక్తి మా సెట్స్‌ని సందర్శించడం ఒక గొప్ప ఆశీర్వాదం. ఆయన కెమెరా పట్టగా, నేను యాక్షన్‌ చెప్పడం మరిచిపోలేని అనుభూతి కలిగించింది. రాబర్ట్‌ రిచర్డ్‌సన్‌ సర్‌… ఈ క్షణాలు నా జీవితం చివరిరోజు వరకు గుర్తుంటాయి’’ అని ట్వీట్‌ చేశారు హరీష్‌ శంకర్‌.