సంకెళ్ల నుంచి జమ్ముకశ్మీర్ విముక్తి పొందింది : ప్రధాని


పార్లమెంటు ఉభయసభల్లో జమ్మూకశ్మీర్‌ విభజన బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. సోమవారం రాజ్యసభలో, మంగళవారం లోక్ సభలోనూ జమ్మూకశ్మీర్‌ విభజన బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.

“ఇదో చారిత్రక ఘట్టం. జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రజల ధైర్యానికి నా నమస్కారాలు. ఎన్నో సంవత్సరాలుగా స్వార్థపూరిత పార్టీల వల్ల ప్రజలు అభివృద్ధికి నోచుకోలేకపోయారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ సంకెళ్ల నుంచి విముక్తి పొందింది. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు విభేదాలను సైతం పక్కనపెట్టి జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొల్పేందుకు కలిసి రావడమనేది ఆ ప్రాంత ప్రజలు గర్వించదగిన విషయం” అని మోడీ ట్విట్ చేశారు.