బాలీవుడ్ రిమేక్’లో బాలయ్య ?


‘జై సింహా’ కలయికలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కె.ఎస్‌.రవి కుమార్‌ ఈసారి బాలయ్య కోసం పవర్ ఫుల్ కథని రెడీ చేశారట. బాలకృష్ణ సరసన ఇద్దరు నాయికలు నటించనున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదికలని తీసుకొన్నారు. ఈ నెల 9న బ్యాంకాక్‌లో చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు.

మరోవైపు బాలయ్యతో సినిమాలు చేసేందులు పలువురు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. అందులో పూరి జగన్నాథ్‌ ఒకరు. బాలకృష్ణతో ఇదివరకు ఆయన ‘పైసా వసూల్‌’ తెరకెక్కించారు. ఆ కలయికలో మరో చిత్రం రూపొందనున్నట్టు సమాచారం. అంతేకాదు.. బాలీవుడ్ హిట్ సినిమా రిమేక్ లో బాలయ్యని నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ బాలీవుడ్ సినిమా ఏంటీ ? దర్శకుడు ఎవరు ?? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి బాలయ్య కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. నిర్మాతలు దొరకడమే కష్టంగా ఉందనేది ఇండస్ట్రీ టాక్.