అఖిల్ ప్లాపులపై నాగ్ షాకింగ్ కామెంట్స్

కింగ్ నాగార్జున తన తనయుల కెరీర్ పై కాస్త ఆందోళనగానే ఉన్నట్టు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా అఖిల్ గురించి. అఖిల్ నటించిన మూడు సినిమాలు అఖిల్, హలో, మజ్ను చిత్రాలు ప్లాప్ అయ్యాయి. నటనలోనూ అఖిల్ గొప్పగా ఏమీ అనిపించలేదు.

అంతకుమించి నాగ చైతన్య విషయంలో నాగ్ ఆందోళన చెందేవారు. చైతూ నటనతో గొప్పగా అనిపించకపోయినా.. ఆయన కెరీర్ స్టార్టింగ్ లో ‘ఏం మాయ చేశావె’ లాంటి హిట్ పడింది. ‘100% లవ్’తో యూత్ కి దగ్గరయ్యాడు. లవ్వర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకొన్నాడు. ప్రేమకథలకి బాగా సరిపోతాడు అనిపించుకొన్నాడు. ఇక, ప్రేమమ్, మజలీ చిత్రాలతో నటుడుగా చైతూ ఓ మెట్టేకేశాడు.

ఇప్పుడు నాగ్ ఆందోళన అంతా చిన్న కొడుకు అఖిల్ పైనే. అఖిల్ తొలి చిత్రాలు ప్లాపే. ప్రస్తుతం అఖిల్ నాల్గో చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా విషయంలో తేడా వస్తే అఖిల్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నాగ్ అఖిల్ విషయంలో ఆందోళనగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

మన్మథుడు 2 సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగ్ ఈ ప్రచారంపై స్పందించారు. “అఖిల్ కెరీర్ గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని తెలిపాడు. అఖిల్ ఇంకా కుర్రవాడే. తన తప్పుల నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాడు. నా కెరీర్ ఆరంభంలో కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నాను. అఖిల్ కి కూడా ఒక రోజు వస్తుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు నాగ్. అది నిజమే వరుస ప్లాపుల తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ రాక్షసుడు చిత్రంతో తొలి హిట్ కొట్టాడు. మరీ.. అలాంటి రోజు అఖిల్ కూడా వస్తుంది. ఆరోజు కోసం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.