బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్‌

పెద్దపల్లి మాజీ ఎంపీ జి. వివేక్‌ భాజపాలో చేరారు. శ్రాణవ శుక్రవారం మంచిరోజు కావడంతో ఢిల్లీ వెళ్లిన ఆయన భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

అంతకుముందు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో వివేక్‌ భేటీ అయ్యారు. తనతోపాటు మేధావులు, పలువురు నేతలు భాజపాలోకి వస్తారని భాజపా అధిష్ఠానానికి వివేక్‌ తెలిపినట్లు సమాచారం.

గత నెలలోనే వివేక్ భాజాపాలో చేరడం ఖాయమైంది. ఐతే, ఆషాడమాసం కావడం ఆయన మంచిరోజుల కోసం వెయిట్ చూశారు. ఇవాళ శ్రావణశుక్రవారం కావడంతో అధికారికంగా భాజాపాలో చేరారు. ఇక, తెలంగాణ నుంచి మరికొందరు సీనియర్ నేతలు భాజాపాలో చేరనున్నట్టు సమాచారమ్. ఈ లిస్టులో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పేరు కూడా వినిపిస్తోంది.